వాజేడులో ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్టు

వాజేడులో ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్టు
వాజేడు, అక్టోబర్ 13 (నాడు నేడు) పేలుడు పదార్థాలతో పాటు విప్లవ సాహిత్యం పుస్తకాలు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బండారు కుమార్, ఎస్సై వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఏటూరు నాగారం నుంచి వెంకటాపురం వైపు వస్తున్న రెండు బైక్‌లను ఆపే ప్రయత్నం చేయగా వారు తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు వెంబడించి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.పట్టుబడ్డ వారిలో ఇద్దరు మాజీ మావోయిస్ట్ సభ్యులు కడారి యాదగిరి, కలకోట ప్రభాకర్ 25సంవత్సరాల క్రితం మావోయిస్ట్ పార్టీలో చేరి అరెస్ట్ అయ్యారు. కాగా, వారితో పాటు మావోయిస్ట్ పార్టీలో చేరేందుకు వెళ్తున్న శివరాతి పవన్ కల్యాణ్, ఎల్మకంటి మహేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్ననట్లు శుక్రవారం సీఐ కుమార్‌ ఒక ప్రకటన లో తెలిపారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమాయకులు మావోయిస్టుల మాటలు నమ్మి వారి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

Пікірлер

    Келесі