ఐటీడీఏను ముట్టడించిన గొత్తికోయలు..

ఐటీడీఏను ముట్టడించిన గొత్తికోయలు
భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం నియోజకవర్గంలో సంప్రదాయ విల్లంబులతో నినాదాలు చేశారు,
వీరి ఆందోళనపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు
విధించారు,గేట్లకు తాళం వేసి ఐటీడీఏలోకి వెళ్లనీయ
కుండా అడ్డుకున్నారు. ఎస్టీ సర్టిఫికెట్, పోడుభూములకు
పట్టాలివ్వాలని డిమాండ్,
బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యం
లో భద్రాచలంలో గొత్తికోయలు ఐటీడీఏ
ఆఫీసును ముట్టడించారు,50 ఏండ్లుగా తెలంగాణ
లో ఉంటున్న తమకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు,
సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వా
లని, ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్
చేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు ధ్వజమెత్తారు.ఆధార్,
రేషన్ కార్డులున్నాయని, ఎన్నికల్లో ఓట్లు కూడా వేస్తున్నారని, అలాంటి వారికి సర్టిఫికెట్ల విషయంలో
ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల వారు విద్యా, ఉద్యోగ అవకాశాలు
కోల్పోతున్నారన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఐటీడీఏ పీవో గౌతమ్ కు
వినతిపత్రం ఇచ్చారు.

Пікірлер

    Келесі